Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
శాసన సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మండల పర్యవేక్షణ అధికారులు, ఎంపీడీఓ, మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోటుపాట్లు లేకుండా ఎన్నికల నియమావళి పాటించాలని, చెక్పోస్టుల వద్ద స్టాటిక్ సర్వేలన్స్ బృందాలు తప్పనిసరిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 23 నుండి ఫొటో ఓటరు స్వీప్, ఎలక్ట్రానిక్ గుర్తింపుకార్డులు పంపిణీ చేయనున్నట్టు, పంపిణీకి బీఎల్ఓ అధికారులకు బూత్స్థాయి ఓటరు అవగాహన కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఐబీ ఏఈ సత్యశీలారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ తిరుపతయ్య పాల్గొన్నారు.