Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
యాసంగి సీజన్లో వరిని సేధ్యం చేసే రైతులు వరిపంట సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి.గిరిబాబు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చలి ప్రభావం వల్ల నాట్లు వేసిన తర్వాత మొక్కల కొనభాగాలు ఎండిపోతాయని రైతులు తొందరపడకుండా జింకు రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి ఐదురోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేయాలని తెలిపారు. పాలితీర్ మందులు 10 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి చల్లాలన్నారు. తూర్పు పడమర్లలో ప్రతి మీటర్లకు 20 సెంటీమీటర్లు కాలిబాటలు వదలాలని నాట్లు వేసిన తర్వాత పిలకలు వేసే వరకు రెండు నుంచి మూడు సెంటిమీటర్ల లోపే నీరు పెట్టాలన్నారు చిరుపొట్ట దశ నుంచి గింజలు గట్టిపడే వరకు వరి మడులలో ఐదు సెంటిమీటర్ల నీటిని పెట్టాల్సి ఉంటుందన్నారు. మధ్యమధ్యలో నీటిని తీసివేసి మడులను ఆరబెట్టి తిరిగి మరుసటిరోజు నీటిని పెట్టాల్సి ఉంటుందన్నారు. వరిచేనులో ఆకుముడుత పురుగు ఎక్కువగా కనిపించిన చోట కొబ్బరితాడుతో ఆకు చివరలను కదిలించి ఆకు ముడత పురుగు కింద రాలిపడేటట్టుగా వేయాలన్నారు. అలాగే నాలుగు వందల గ్రాముల కిరోసిన్ను పదికిలోల ఇసుకలో కలిపి వరిపొలంలో చల్లాలని దీనివల్ల ఆకుముడత పురుగు చనిపోయే అవకాశం ఉందన్నారు. రైతులు యాసంగి సీజన్లో వరిపంట సంరక్షణకు సస్యరక్షణ చర్యలలో భాగంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సిబ్బందిని కలిసి సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు.