Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని మంగళపల్లి, తాటికల్, చందుపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లను అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మంగళపల్లి పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి దోరేపల్లి రక్షితకు రూ.1000 ఆర్థిక సాయం అందజేశారు. క్లబ్ అధ్యక్షులు దేవరశెట్టి పెద్ద శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు శివప్రసాద్, బానాల రాంరెడ్డి, ఎర్ర శంభులింగారెడ్డి, మల్లారెడ్డి, యాదగిరిరెడ్డి, బోలర్ల కృష్ణమూర్తి, పెండెం ఆంజనేయులు, శ్రీనివాస్లతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.