Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
ఈ నెల 26 నుండి 28 వరకు ఎస్ఎల్బీసీలో గల డాన్బోస్కో పాఠశాలలో నిర్వహించనున్న ఇన్స్పైర్ మానక్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈఓ సరోజినీ దేవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకుగాను జిల్లాలోని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు, సైన్స్, గణితం ఉపాధ్యాయులచే 14 కమిటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ ప్రాజెక్టుల నుంచి 10శాతం నాణ్యత ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్టు పేర్కొన్నారు.