Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ఓట్ల తేడాతో మూడుసార్లు రీ-కౌంటింగ్
- నామానాయక్తండాలో ఉద్రిక్తత
నవతెలంగాణ-మర్రిగూడ
నాంపల్లి మండల పరిధిలోని నామానాయక్తండాలో సోమవారం జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ పడిన వ్యక్తుల మధ్య రెండు ఓట్ల స్వల్ప తేడా ఉండడంతో మూడుసార్లు రీ-కౌంటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ పరిధిలో మొత్తం 670 ఓట్లకు 639 ఓట్లు పోలయ్యాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ మద్దతురాలైన వడ్త్యా లకిëకి 317, టీఆర్ఎస్ మద్దతురాలు రమావత్ సుగుణకు 319 ఓట్లు రాగా మరో మూడు ఓట్లను చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఇరువురి మధ్య రెండు ఓట్లు మాత్రమే తేడా ఉండటంతో ఓటమి పాలైన లకిë మద్దతుదారుడు రీ-కౌంటింగ్ చేయాలని మూడుసార్లు చేయిం చారు. అయినా సంతృప్తి చెందని ఆమె వర్గీయులు పోలింగ్ అధికారితో వాగ్వివాదానికి దిగి అధికారిని స్వల్పంగా గాయపర్చి గదిలో నిర్బంధించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని శాంతింపజేశారు. ఆర్డీఓ లింగ్యా నాయక్, డీఎస్పీ మహేశ్వర్, సీఐ ప్రభాకర్రెడ్డి గ్రామానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి రీ-కౌంటింగ్ రెండు ఓట్ల తేడాతోనే రమావత్ సుగుణ గెలిచినట్టు ప్రకటించారు.