Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
కామేపల్లి గూడెం గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సీపీఐ(ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేవెల్లి రామచంద్రయ్య అన్నారు. మంగళవారం మండలంలోని ఆ గ్రామంలో తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొన్నేండ్లుగా మౌలిక వసతుల్లేక కాలనీలు దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. మురికికాల్వలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, అంతర్గత రోడ్లు లేవన్నారు. తనను గెలిపించినట్టయితే గ్రామాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాంరెడ్డి, హుస్సేన్, వెంకన్న, నాగయ్య, నరేశ్, జానయ్య, సైదమ్మ పాల్గొన్నారు.