Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోని గ్రామాల్లో గెలుపొందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచులు ప్రజలతో కలిసి మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పాటుపడి పని చేస్తామన్నారు.ఈఎన్నికల్లో మర్రిగూడ, నాంపల్లిలలో కాంగ్రెస్ సర్పంచ్లు అధిక స్థానాల్లో గెలుపొందారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఉన్నందునే అధిక స్థానాలు సాధించామని పలు గ్రామాల సర్పంచులు తెలిపారు. అందుకు తగ్గట్లుగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.