Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కట్టంగూర్
ఈ నెల 30న మండలంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉండగా వాటిలో ఒక గ్రామంలో సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 21 గ్రామాలలో 121 మంది అభ్యర్థులు సర్పంచ్కు నామినేషన్లు వేయగా 56 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మండలంలో మొత్తం 206 వార్డులు ఉండగా 631 మంది నామినేషన్ వేయగా వారిలో 158 ఉపసంహరించుకున్నారు. 473 మంది బరిలో ఉన్నారు. రామచంద్రపురం గ్రామంలో సర్పంచ్తో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా సూరారపు ప్రియాంక ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా ఐదుగురు నామినేషన్లు సమర్పించారు. నలుగురు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. వార్డు సభ్యులు 19 మంది నామినేషన్లు వేయగా 11 మంది ఉపసంహరించుకోవడంతో 8వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటితోపాటు మేజర్ గ్రామ పంచాయతీ కట్టంగూర్లోని 13వ వార్డులో నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు ఉపసంహరించుకోగా మిగిలిన అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. గార్లబాయిగూడం గ్రామంలో ఒక వార్డు, నల్లగుంటపోలు గ్రామంలో 6 వార్డులు, మల్లారంలో ఐదు వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
నార్కట్పల్లి: ఈ నెల 30 న గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు ఎత్తుకు పై ఎత్తులు రసవత్తరంగా సాగుతున్నాయి. హేమాహేమీలు పోటీలు పడుతుండటంతో పరిశీలనలో తొలగించడం బేరసారాలతో మంగళవారం ఉపసంహరణ ఘట్టం ముగిసింది మండల వ్యాప్తంగా 29 గ్రామపంచాయతీ ల్లో శేరిబాయిగూడెం ఒకేఒక్క నామినేషన్ రావడంతో ఒక్క గ్రామపంచాయతీ ఏకగ్రీవం కాగా మిగతా 28 గ్రామపంచాయతీలల్లో పోటీ రసవత్తరంగా ఉంది.
పోటీలో పడుతున్న అభ్యర్థులు
పోతినేనిపల్లిలో.... ఆదిమల్ల అంజయ్య, ఆదిమల్ల ప్రవీణ్కుమార్, ఆదిమల్ల యాదగిరి, ఆదిమల్ల లింగస్వామి, మాండ్రా దొండసౌమ్య, ధనల× మల్లెబోయిన, ఎల్లారెడ్డిగూడెంలో... తోటకూరి ఉమా, కట్ట నిర్మల, దండు సరస్వతి, మేడి పుష్పలత, చెర్వుగట్టు, రేగట్టె ఆనందం, మాల్గ బాలకృష్ణ, రేగట్టె రాజశేఖర్రెడ్డి, లింగారెడ్డి,
దాసరిగూడెంలో.... ఉప్పల్ బాగ్యమ్మ, ఉప్పల అనంతల×, అమ్మనబోల్లో... బద్దం వరమ్మ, పల్లూరి స్వప్న, మహ్మద్ శబానాబేగం, ఈదుల గంటి శివరాణి, పల్లెపహాడ్లో.. అనంతరెడ్డి పులిసాని, మోహన్రెడ్డి, రామచంద్రారెడ్డి, బెండల్పాడ్లో... వంగాల సైదులు, హందాల వెంకట్రెడ్డి, ఎడమ శేఖర్రెడ్డి, బాజకుంటలో... ఈనూరి సరిత, మహేశ్వరం సువర్ణ, బి.వెళ్లంలలో... జ్యోతి యాస, బొడిగె పెద్దమ్మ, మాదవి యారాల, ఎదుగుల దోరిలో... మహేశ్వరం లింగయ్య, మహేశ్వరం సతీష్, ఔరవాణిలో..అండాలు మాదగోని, జయల×, నడిగోటి శైలజ,సిలివేరు మహేశ్వరి, బీడంపల్లిలో... చంద్రయ్య చెరుపల్లి, చెరుకు ల×, దుబ్బ మధు, నర్సింహ్మ మేడి, గోపలపల్లిలో... అల్లె పరమేష్, గోనుల భద్రాచలం, గోనుల సుజాత, కొండపాకగూడెంలో....కొమ్మనబోయిన మల్లేష్, మేక దేవరాంరెడ్డి, చిన్ననారాయణపురంలో... కొత్త నర్సింహయాదవ్, బిక్షమయ్య శివ, ఏపీలింగోటం... కొవ్వి శంకరయ్య, నూకల శంకర్, పనస వెంకటయ్య, తొండల్వాయి... వెంకటేష రెడ్డి పల్లి, బింగి కొండయ్య, వెంకన్న మేకల, మట్టి నర్సింహ, తిరుమలగిరిలో... బోడ సునీత, బోడ మల్లమ్మ, నార్కట్పల్లిలో...దూదిమెట్ల శ్రవంతి, పాశం లతాశ్రీ, పుల్లెంల పద్మ, ముంత మహేశ్వరి, అక్కనపల్లిలో... ఆక్వారం శ్రీనివాస్, కుమారస్వామి బిరబోయిన, మాదాసుచంద్రశేఖర్, చిన్న తుమ్మలగూడెంలో...దాసరిరాజు, నర్సింహ, చిప్పలపల్లిలో...ఉప్పుల జయమ్మ, కలమ్మ వలిగొండ, గద్దపాటి నాగమ్మ, వేర్పుల సిపోరారాణి, వంగల పుష్పలత, నక్కంపల్లిలో.. ఈద మాదవి, యాదమ్మ పల్లగొర్ల, జువ్విగూడంలో... సూదిరెడ్డి ప్రేమలత, అల్గువెల్లి పద్మ, శాపెల్లిలో.. కందికట్ల ఆంజనేయులు, ఉపేందర్ కర్నాటి, లింగయ్య నిమ్మనగోటి పోటీ పడుతున్నారు.
నకిరేకల్ మండలంలో బరిలో 23మంది అభ్యర్థులు
నకిరేకల్ : నకిరేకల్ మండలంలో ఎన్నికలు జరిగే 10 గ్రామపంచాయతీలకు నూతనంగా ఏర్పడిన నడిగూడెం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. నడిగూడెం సర్పంచ్గా మాద నాగరాజుతోపాటు 8మంది వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్టు ఎంపీడీఓ జె.వెంకటేశ్వరరావు తెలిపారు. మిగిలిన 9గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 23 మంది అభ్యర్థులు 82 వార్డులకు 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోరెంకళపల్లిలో చెట్టుపల్లి జానయ్య, చెట్టుపల్లి భాస్కర్, మండలాపురంలో కందిమల్ల పద్మ, గుడుగుండ్ల లక్ష్మమ్మ, దండి సంధ్యారాణి, మంగళపల్లిలో అంతటి శరత్బాబు, కందికంటి నాగేంద్రబాబు, ప్రగడపు నవీన్కుమార్, బచ్చుపల్లి మునీందర్రావు, మర్రూరులో చిలుకూరి గోవర్దన్, వలిశెట్టి స్వప్న, మోదినిగూడెంలో పగడాల సైదులు, వరిశెట్టి శ్రీనివాస్, నర్సింహపురంలో మాలె పవన్రెడ్డి, మంగమ్మ చిట్టిమల, ఓగోడులో అబ్బగోని వెంకటమ్మ, దోరెపల్లి సరళ, అబ్బగోని విజయలక్ష్మీ, పాలెంలో ఏకుల కవిత, కత్తుల సుప్రియ, కందుకూరి సత్తమ్మ, వల్లభాపురంలో మొర్సు నాగమ్మ, ఎం.జయమ్మ సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు.
చండూరులో ఆరు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
చండూరు: మండలంలోని మొత్తం 23 గ్రామపంచాయతీలకు ఆరు ఏకగ్రీవమయ్యాయి. చొప్పరిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చొప్పరి అనురాధ వెంకన్న, పడమటిశాల గ్రామపంచాయతీ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన మేకల వెంకన్న, ఉడుతలపల్లి కాంగ్రెస్ బలపరిచిన పొలిమి అలివేలు ఓంకారం, బోడెంపర్తి స్వతంత్ర అభ్యర్థి మంచికంటి రాణి వెంకట్రమణ, జోగిగూడం సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన వట్టి వసంత, తిమ్మారెడ్డిగూడం సర్పంచ్గా టీఆర్ఎస్ బలపరిచిన కొండారెడ్డి వెంకట్రెడ్డి ఏకగ్రీవమయ్యారు. పడమటిశాల, జోగిగూడెం, తిమ్మారెడ్డిగూడెం ఇటీవల నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి.
శాలిగౌరారం:మండలంలో నామినేషన్ ఉపసంహరణ ముగిసింది అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మండలంలోని 24 గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అడ్లూరు గ్రామంలో 10వ వార్డు అభ్యర్థి మిర్యాల భాస్కర్, ఇటుకులపాడు 4వ వార్డు అభ్యర్థి తాటిపాముల శ్యామల, 9వ వార్డు అభ్యర్థి సుల్తాన్ ఎల్లయ్య, 10వ వార్డు అభ్యర్థి అంబటి నాగమ్మ, జాలోనిగూడెం 4వ వార్డు జమ్ము సైదులు, ఉప్పలంచ 5వ వార్డు అభ్యర్థి మెరుగు యాదగిరి, 7వ వార్డు అభ్యర్థి యాదమ్మ బాల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంపీడీఓ అంబాబారు తెలిపారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 68 సర్పంచ్ అభ్యర్థులు, 223 వార్డు సభ్యులకు 472 అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలిపారు.