Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పీఠికను కూడా చదివి వినిపించాలని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ మామిడి సైదులు కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఆ వేడుకలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫొటో, రాజ్యాంగ నమూనాను కూడా ఉంచాలన్నారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వెంకట్, రాంబాబు, శ్రీను, దినేష్, వంశీ, యాదగిరి, సైదులు, సుధాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.