Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
9వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలో మంగళవారం నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో నకిరేకల్ ఎస్పీఆర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి వి.వైష్ణవి వ్యాసరచన విభాగంలో, డి.నందిని ఉపన్యాస విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచగా వీరిని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్డీవో తదితరులు అభినందించారని ఆయన పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బి.కన్నయ్యగౌడ్, పాఠశాల విజినరి శ్రీపతిరెడ్డి, చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్ సుందరి శివరామకష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.