Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఈ నెల 24న పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో హైదరాబాద్ గ్లోబల్ ఐ హాస్పిటల్ వారిచే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పసల మరియదాసు, జొనుపునూరి సోమయ్యలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషను నిర్వహించడంతో పాటు భోజన వసతి, రవాణా ఖర్చులు ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.