Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
వట్టిమర్తి గ్రామస్తులు ఓటువేసి సర్పంచ్గా తనను గెలిపిస్తే ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని సీపీఐ(ఎం), కాంగ్రెస్ బలపర్చిన పర్రె నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పలు వార్డులలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. గ్రామంలోని మౌలిక సమస్యలు, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న తనను గెలిపించాలని కోరారు. గ్రామంలో పారిశుధ్యం పెంపొందించి వీధిలైట్లు, తాగునీరు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వీధులలో రోడ్లు నిర్మిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మేడి కృష్ణయ్య, గ్రామ అధ్యక్షుడు మేడి శ్రీను, గురువు ముత్యంశెట్టి, జాల యాదగిరి, మేడి నరసింహ, మేడి రాజు, దుర్గయ్య, రాంప్రసాద్, సత్యంబాబు, భిక్షంరెడ్డి, మురళీధర్, శ్రీకాంత్రెడ్డి, ప్రకాశ్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.