Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
40 ఏండ్లుగా గ్రామంలో లేని అభివృద్ధి గెలిపిస్తే నాలుగు నెలల్లో చేసి చూపిస్తానని టీఆర్ఎస్ బలపరిచిన పోతునూరు సర్పంచ్ అభ్యర్థి తుమ్మ దుర్గమ్మ అన్నారు.మంగళవారం పోతునూరు గ్రామంలో తనను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. మహిళలకు, ప్రజలకు తన గుర్తును చూపిస్తూ ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆమె తాను దళితురాలిని అయినా..గ్రామాభివృద్ధి కోసం ప్రణాళిక తయారు చేశానని, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానని గ్రామస్తులకు హామీనిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సుకన్య, విజరు, చింతల వెంకన్న, కొండలు, సంజీవ పాల్గొన్నారు.