Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ శ్రీనివాస్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. మంగళవారం స్థానిక రూరల్ పోలీస్స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.మిర్యాలగూడ డివిజన్లోని 224 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగను న్నాయని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటేయాలని కోరారు. రాజకీయ పార్టీల నాయకులు అల్లర్లు సృష్టించకుండా ఉండాలన్నారు. ముందస్తుగానే గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అల్లర్లు చేసే వారిపై నిఘా ఉంచామని, గొడవలు సృష్టిస్తే ఎన్నికల రౌడీషీట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘర్షణలకు కారకులైన వారికి కౌన్సిలింగ్ ఇప్పించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ వ్యాప్తంగా ఆరుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 1200మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. 75 మొబైల్ టీమ్లు కూడా ఏర్పాటు చేశామని, ఆయా రూట్లలో నిఘా ఉంచామన్నారు. సామరస్యంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్గించొద్దని సూచించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రమేశ్బాబు, టూటౌన్ సీఐ శ్రీనివాసరెడ్డి, రూరల్ ఎస్సై సైదాబాబు పాల్గొన్నారు.