Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్,వార్డు సభ్యులకే ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే భాస్కర్రావు కోరారు. మంగళవారం మండలంలోని కొండ్ర పోల్, బొత్తల పాలెం, గణేశ్పహాడ్, దామరచర్ల, వాడపల్లి, వీర్లపాలెం గ్రామాల్లో మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాలు అభివృద్ధి చెందు తాయన్నారు.తండాలను గ్రామ పంచా యతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వీరకోటిరెడ్డి,నారాయణరెడ్డి, గజ్జెల వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి పాల్గొన్నారు.