Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
చిన్ననాటి నుంచి ఇద్దరు స్నేహితులుగా ఒకే ఊరులో ఒకే బడిలో చదువుకున్నారు. గత సోమవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకరు సర్పంచ్ అభ్యర్థిగా, మరొకరు వార్డు సభ్యులుగా పోటీ చేశారు. ఒకరు సర్పంచ్గా, మరొకరు ఉపసర్పంచ్గా ఎన్నిక య్యారు. వివరాల్లోకెళ్తే.. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన కుంభం శ్రీనివాస్గౌడ్ సోమ వారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా 236 మెజార్టీ ఓట్లతో సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నారు అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి గంధం సురేష్ వార్డు మెంబర్గా గెలుపొంది మంగళవారం స్థానిక జీపీ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో 13 మంది వార్డు సభ్యులతో ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ అభ్యర్థిగా ఎన్నిక య్యారు ఈ సందర్భంగా గ్రామస్తులు స్నేహితులు ఇదర్ని గజమాలతో ఘనంగా సత్కరించారు.