Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్టవర్
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 9వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలలో ప్రథమ స్థానం పొందినవారిని ఈ నెల 24న రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ఉప్పల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో జాతీయ ఓటరు దినోత్సవం పై సమీక్షించారు. జాతీయ ఓటరు దినోత్సవం రోజున పట్టణంలో ఉదయం 8.30గంటలకు ఎన్జీ కళాశాల నుంచి క్లాక్టవర్ వరకు విద్యార్థులతో ర్యాలీ, 9.30గంటలకు క్లాక్టవర్ వద్ద సమావేశానికి ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ రోజు సీనియర్ సిటిజన్లు, సీనియర్ ఓటర్లను, కొత్తగా నమోదైన ఓటర్లను సన్మానం, కొత్త ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాద్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.