Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిపోల ఎదుట ఎస్డబ్ల్యూఎఫ్ ధర్నా
నవతెలంగాణ-క్లాక్టవర్
2019-20 రాష్ట్ర బడ్జెట్లో 1శాతం నిధులను ఆర్టీసీకి కేటాయించాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి, ఎస్డబ్య్లూఎఫ్ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షుడు కందుల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్డబ్య్లూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారకులు కారని ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాలే కారణమన్నారు. వెంటనే వాటిని సరలీకరించాలని డిమాండ్ చేశారు. అనేక కేటగిరిలలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి వల్ల పనిభారం పెరుగుతుందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న రెగ్యులేషన్స్ను మార్చాలని, కార్మికులకు రావాల్సిన డీఏ ఏరియల్స్ను వెంటనే చెల్లించాలని అన్నారు. మహిళా కండక్టర్లకు ప్రత్యేక చార్టు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి శ్యాంసుందర్, రీజియన్ ఉపాధ్యక్షులు చంద్రమౌళి, నరసింహ్మయ్య, యాదయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.