Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ:పట్టణంలోని బంగారుగడ్డలో అనారోగ్యంతో మృతి చెందిన భాస్కర మంజుల జ్ఞాపకార్థం మున్నూరుకాపు సంఘం భవన కమిటీకి రూ.1,00116 విరాళం అందజేశారు. తన తండ్రి జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేస్తున్నట్టు కుమారుడు సాయికుమార్ తెలిపారు. నగదును రాష్ట్ర కమిటీ సభ్యులు నల్లగుంట్ల సోమయ్య ఆధ్వర్యంలో కమిటీకి అందజేశారు. సంఘం అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతి వెంకటేశ్వర్లు, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, గంధం సైదులు, సత్యనారాయణ, కృష్ణ, పాండు, నూనె రవి, ముత్యాల లకిëనారాయణ పాల్గొన్నారు.