Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లిటిల్ఫ్లవర్'లో షీ క్రాఫ్ట్
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థులు ఆలోచించే విధంగా శాస్త్రవేత్తలు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ నాగలకిë భార్గవ్ అన్నారు. శనివారం స్థానిక లిటిల్ఫ్లవర్ పాఠశాలలో పర్యావరణంపై షీ క్రాఫ్ట్ నిర్వహించారు.అనేక ఎగ్జిబిట్లను ప్రద ర్శనలో ఉంచి వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నాగలకిë ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ఆలోచనాశక్తిని పెంచుకోవాలన్నారు. నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా మెదడుకు పదును పెట్టాలన్నారు. ఎంఈఓ బాలాజీనాయక్ మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శన వల్ల విద్యా ర్థుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, వారిలో శాస్త్ర, సాంకేతిక రంగాన్ని పెంచేందుకు ఉపయోగ పడు తుందన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలని కోరారు.అనం తరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినం దించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పశ్యా శ్రీనివాసరెడ్డి, ఆర్టిస్టు సందీప్రెడ్డి, డాక్టర్ వాసవి, ప్రిన్సిపాల్ కెకె.జయ రాజన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.