Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
కాంగ్రెస్ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అందరికీ తాము అండగా ఉంటామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేతావత్ శంకర్నాయక్ అన్నారు. శనివారం త్రిపురారం మండలంలోని అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ నెల 26న పార్లమెంటు సన్నాహక సమావేశానికి టీ.పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి హాజరవుతున్నారని తెలి పారు.ఈ సమావేశానికి పార్టీ శ్రేణులంతా కలిసి రావాలని కోరారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి చింత అవసరం లేదని, పార్టీ కార్యకర్తలంతా మనోధైర్యంగా ఉండి పార్టీకి అండగా నిలవాలని కోరారు. పార్టీని మోసం చేసిన వారికి రాబోయే రోజుల్లో పుట్టగతులుండవని హెచ్చరించారు. పార్టీ నుంచి రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. కల్లబొల్లి మాటలతో పార్టీని నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కసిరెడ్డి నరేష్, సీనియర్ నాయకులు అనుముల నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాజారాంసింగ్, సైదయ్య, అంజిరెడ్డి, ఆలంపల్లి జానయ్య, ఎంపీటీసీలు సాంబయ్య, మాజీ ఎంపీ టీసీ ఎం. వెంకట్రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండ లాధ్యక్షుడు చిలుముల శ్రీను, ఎ. శ్రీని వాసరెడ్డి, అనంతుల నర్సింహారెడ్డి, అప్పయ్య, పాండు నాయక్, వెంకట్రెడ్డి, నాగయ్య పాల్గొన్నారు.