Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని రైతుసమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లాగా పని చేసి టీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వేంరెడ్డి నర్సింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 29న నల్లగొండలో కేసీఆర్ సభ ఉందని, దీనికి గాను నియోజకవర్గం నుంచి 30 వేల మంది కార్యకర్తలను తరలించాలన్నారు. దేశమంతా కేసీఆర్ సంక్షేమ పథకాల వైపే చూస్తుందని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించబోతుందన్నారు. ప్రజలు కేసీఆర్కు అండగా నిలిచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలోమార్కెట్ చైర్మన్ చిట్టిబాబునాయక్, పట్టణా ధ్యక్షుడు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ బాలు, ఎమ్డి .మోసిన్అలీ, చిర్ర మల్లయ్యయాదవ్, కుంద ూరు వీరకోటిరెడ్డి, చౌగాని భిక్షం, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, బాబయ్య, హనుమంతరెడ్డి, మట్టపల్లి సైదయ్య, పాశ్చునాయక్, మారుతి వెంకట్రెడ్డి, రవీందర్, లావూరి శ్రీనునాయక్, బారెడ్డి అశోక్రెడ్డి, గడగోజు ఏడుకొండలు పాల్గొన్నారు.