Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు
- రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ఉప్పల్
నవతెలంగాణ-నల్లగొండటౌన్
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉన్నందున అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. అధికారుల మధ్య కమ్యూనికేషన్,సమన్వయం అవసరమని అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. ఆమరుకుమార్ తో కలిసి నల్గొండ, సూర్యా పేట జిల్లాల సహాయ రిటర్నింగ్ అధికారులు, మండల పర్యవేక్షక అధికారులు, నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలన్నారు. వెబ్ కాస్టింగ్కు బీఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి సాధ్యా సాధ్యాలు పరిశీలించాలన్నారు. ఎన్నికల రోజు, అనంతరం ఎటువంటి సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. కమ్యూనికేషన్ లేని షాడో ప్రాంతాలలో ఉన్న పోలింగ్కేంద్రాలపై అధికారులు దృష్టి సారించాల న్నారు. వికలాంగుల ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ రోజున మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఈవీఎం నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సూర్యా పేట జిల్లా కలెక్టర్ డి. అమరు కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు మండల స్థాయి వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల మధ్య సమన్వయం అవసరమన్నారు. మండల పర్యవేక్షక, సెక్టార్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షఇంచాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రయ్య, అసిస్టెంట్ కలెక్టర్ ఉదరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.