Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్ అన్నారు. గురువారం మండలంలోని బంఖాపురం పాఠశాల విద్యార్థులకు హాలియాలోని టైమ్స్ స్కూల్ సహకారంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెన్నులు, నోట్పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయన్నారు. దీంతో పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టైమ్స్ స్కూల్ యాజమాన్యం నరేందర్రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ యాదయ్య, అనిత, విద్యాకమిటీ చైర్మన్ గిరిబాబు, గ్రామ ఉపసర్పంచ్ సతీష్కుమార్, ఉపాధ్యాయులు జగన్, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్, నాగరాజు, వెంకన్న పాల్గొన్నారు.