Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని దేవరకొండ, డిండి ఎంపీపీలు నల్లగాసు జాన్ యాదవ్, మాధవరం సునీతా జనార్థన్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలోని సామాజిక సేవా సదన్లో ఇటీవలే ఎంపీపీలుగా ఎన్నికైన జాన్ యాదవ్, సునీతలను గురువారం ఘనంగా సన్మానించారు. డిండి ఎంపీపీగా ఎన్నికైన మాధవరం సునీత తమ సంఘం సభ్యురాలిగా ఉంటూ ఎంపీపీగా ఎన్నిక కావడం శుభ సూచికమని ఆ సంఘం అధ్యక్షులు టి. నర్సింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి లింగయ్య, ఐజాక్, ఎండి. యూసుఫ్ షరీఫ్, చెన్నయ్య, పి. రామచంద్రం, నాగయ్య, దామోదర్రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.