Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో సీఎం సహాయనిధి కింద గ్రామానికి చెందిన ధనమ్మకు రూ.13 వేలు, సరితకు మంజూ రైన రూ.11 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు. నిరుపేదలకు ఆర్థిక భరోసానిచ్చేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లం రవి, పోలె డేవిడ్, వెంకన్న, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, ఈశ్వర్ప్రసాద్, రాము, మహేష్ పాల్గొన్నారు.