Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడవిదేవులపల్లి
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా అధికారులు గురువారం స్థానిక బస్టాండ్లో ఉన్న షాపులు, పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మిరాం మాట్లాడుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే షాపు యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుం టే హెల్ప్ లైన్ నెంబర్1098 కాల్ చేసి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ చైర్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు ఉజ్వల, శ్రీకాంత్, బాల భిక్షం పాల్గొన్నారు.