Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పెద్దఅడిశర్లపల్లి
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి, సర్పంచ్ గొర్ల సైదమ్మ శ్రీనివాస్యాదవ్, ఎంఈవో తరి రాము గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను కోరారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే మా దష్టికి తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడు శ్రీనివాస్, బొడ్డుపల్లి మహేందర్, చిట్టిమల్ల శివశంకర్, ధర్మాపురం అమరేందర్ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : మండల పరిధిలోని ఉల్సాయపాలెం గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలను గురువారం తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూను సక్రమంగా పాటిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు, ఆట స్థలం, వంటగదిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సైదులు, ఎంపీపీ బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.