Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఫ్రెండ్స్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఝాన్సీ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, యువత ఉచితంగా క్రీడా సామాగ్రి, పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెగావత్ కొండానాయక్, అధ్యక్షులు భరత్, ఎంపీటీసీ వెంకటయ్య, సర్పంచ్ విజరు, యూత్ సభ్యులు శ్రీను, రమేశ్, జలేందర్, ఉపాధ్యాయులు రామకృష్ణ, కుర్మారెడ్డి, రమణ, విజయలక్ష్మి, జ్యోతి, రాణి పాల్గొన్నారు.