Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్పల్లి
రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డా. కూరెళ్ళ విఠలాచార్యకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అందజేసే దాశరథి పురస్కారంకు ఎంపిక చేయడం పట్ల స్థానిక వీర బ్రహ్మేంద్రస్వామి దేవస్థాన వ్యవస్థాపకుల పెందోట సోమయ్య గురువారం హర్షం వ్యక్తం చేశారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కూరెళ్ళ సొంత గ్రామంలో సుమారు 80వేలక పైగా గ్రంథాలను సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే అనేక సభలు, చర్చాగోష్టిలు నిర్వహిస్తూ సాహిత్యకారులచే ప్రశంసలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో అద్దంకి బిక్షమాచారి, చొల్లేటి శ్రీనివాస్, రమేశ్, పుష్పగిరి, రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.