Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్పల్లి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్నలా అండగా ఉంటూ పేద బడుగు, బలహీన వర్గాల ఆడపిల్లల పెండ్లి భారం కావద్దనే షాదీముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా గౌరిదేవి ఇంద్రమ్మ, పద్మ, పన్నాల వెంకటమ్మ, బక్కమ్మ, వడ్డగోని పార్వతమ్మ, దేవకమ్మ, నాగమ్మ, నూతనగంటి లింగమ్మ, అండాలు, వసంతలకు కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, తహశీల్దార్ వందనపు శ్రీదేవి, ఎంపీడీఓ సాంబశివరావు, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.