Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పద్మశాలి భవన్లో ఆ పార్టీ అసెంబ్లీ విస్తారకుల కార్యాశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పార్టీ సభ్యత్వాలను చేయించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెట్టే పథకాలను ప్రజలకు వివరించి వారికి అందేలా చూడాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్ ఉంటుందన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత, అసెంబ్లీ కన్వీనర్ మండల వెంకన్న, నాయకులు గోలి ప్రభాకర్, అశోక్, వెంకటేశం, యానాల శ్రీనివాస్రెడ్డి, కొండేటి శ్రీను, దాకయ్య, పాల్వాయి భాస్కర్రావు, చెరుకు రోశయ్య పాల్గొన్నారు.
చండూరు:మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించే విధంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్రెడ్డి అన్నారు. గురువారం భారతి చంద్ర గార్డెన్స్లో విస్తారక్ కార్యాశాల సమావేశంలో ఆయన మాట్లాడారు. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సభ్యత్వ ప్రముఖ్ గార్లపాటి జితేందర్, అసెంబ్లీ రాష్ట్ర నాయకులు అమరేందర్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భిక్షం, శ్రీనివాస్రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సోమ నర్సింహ, జిల్లా కార్యదర్శులు దర్శనం వేణు, గోపినాథ్, ఎంపీటీసీ లక్ష్మమ్మ, మండల అధ్యక్షుడు రావిరాల శ్రీను, ప్రధాన కార్యదర్శి అన్నెపర్తి యాదగిరి పాల్గొన్నారు.