Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ దేశ్యానాయక్ కోరారు. గురువారం మండలంలోని ముప్పారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీ వరకూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లోనూ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతులు తమ సమస్యలను గ్రామసభలకు వచ్చిన అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామారావు, రషీద్, వీఆర్వో సతీష్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.