Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విశ్వ విద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల, కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సైన్స్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్-2 ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. అంతకుముందు మొదటిసారిగా ఎంజీయూకు విచ్చేసిన వీసీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఎం. యాదగిరి, డాక్టర్ అల్వాల, కె.అంజిరెడ్డి, డాక్టర్ ఎం.రమణారెడ్డి, డాక్టర్ కె.లక్ష్మీ, ఉపేందర్రెడ్డి, మచ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.