Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 20న కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2018 మే 16న సీఎం కేసీఆర్ ఉద్యోగ ఉపాధ్యాయులతో నిర్వహించిన జేఏసీ సమావేశంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని పేర్కొన్నారు.