Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని ఎస్ఐ జానకిరాములు సూచించారు. గురువారం గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుండే క్రమ శిక్షణను అలవర్చుకోవడం వల్ల ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని తెలిపారు. నేటి సమాజంలో చెడు వ్యసనాలైన మద్యం, సిగరెట్లు తాగడం, మోటార్ బైక్లు వేగంగా, ప్రమాదకరంగా నడపటం, మత్తు పదార్థాలకు లోను కావడం, ఈవ్ టీజింగ్లకు పాల్పడటం వాటికి తొందరగా ఆకర్శితులవుతున్నారన్నారు. ఎంతో మంది తమ వ్యసనాల కోసం దొంగతనాలు, దోపిడీలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి, కరస్పాండెంట్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ట్రైనింగ్ ఎస్ఐ సతీశ్, డైరెక్టర్ సరికొండ వెంకన్న, రామయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.