Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నార్కట్పల్లి
నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో డీఆర్డీఏ పీడీ శేఖర్రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో 5వ విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటిన్నర మీటరు ఎత్తుగల మొక్కలు మాత్రమే నాటాలని సూచించారు. అన్ని శాఖల వారీగా జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన టార్గెట్లను మండలంలోని అన్ని గ్రామాలకు మొక్కలను పంపిణీ చేసి ఆయా డిపార్ట్మెంట్ల సిబ్బంది గ్రామాల్లో మొక్కలు నాటే విధంగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. ఫారెస్ట్, నర్సరీల్లోని మొక్కలను మాత్రమే నాటాలని సూచించారు. సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి గుంతలు తీయించడం, మొక్కలు నాటి సంరక్షించడం, సంరక్షకున్ని నియమించడం, నాటిన మొక్కలను కాపాడటానికి కమిటీలను ఏర్పాట చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సరోజినిదేవి, డీఎఫ్ఓ శాంతారాం, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఎంపీడీఓ సాంబశివరావు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.