Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికులలు నిరంతరం దీక్షలు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నేండ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : కే.ఎస్.రెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రతి డిపోలో కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. ఓడీని రద్దు చేయాలి. ఎన్నో ఏండ్లుగా కార్మికులు తీవ్ర పని ఒత్తిడితో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వెంటనే పరిష్కరించాలి. లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతాం.
ఉద్యోగ భద్రత కల్పించాలి : కె. శ్యాంసందర్, ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి
ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్న రెగ్యులరైజేషన్ను మార్చాలి. కార్మికులకు రావాల్సిన డీఏ, ఏరియర్స్ను వెంటనే చెల్లించాలి. బస్సుల సంఖ్యను పెంచి ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యను విడనాడాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
వేతన సవరణ అమలు చేయాలి : ఎన్ఆర్సి. రాజు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి
01.04.2015 నుండి రావాల్సిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. మహిళ కండక్టర్లకు రాత్రి 9 గంటల లోపు డ్యూటీలు వేయాలి. ప్రతి కార్మికునికి పొజిషన్తో సంబంధం లేకుండా నెలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలి. డబుల్ డ్యూటీ చేసే కార్మికులకు సీఆఫ్ ఇవ్వాలి. గ్యారేజ్ కార్మికులకు సరిపడా టూల్స్, స్పెర్ పార్ట్స్ సప్లై చేయాలి.
సరిపడా శ్రామికులను నియమించాలి : ఏఎల్.స్వామి, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్షుడు
గ్యారేజ్లో సరిపడా శ్రామికులను నియామకం చేసుకోవాలి. వాహన కండీషన్ను మెరుగు పర్చుకోవాలి. డ్రైవర్, కండక్టర్, మెకానిక్లపై పెంచిన పనిభారం వెంటనే తగ్గించాలి. ఎంటీడీ 141 కార్డులపై అట్టి సర్వీస్లకు ఇచ్చే ఓటీ స్పష్టంగా తెలియజేయాలి. డ్రైవర్లను బలవంతంగా డ్యూటీలు చేయించే విధానం మానుకోవాలి.