Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి పాఠశాలలను బలోపేతం చేయాలని జెడ్పీటీసీ ధనలక్ష్మి నగేశ్ గౌడ్ కోరారు. గురువారం పట్టణంలోని బాబాన్సాహేబ్గూడెం ప్రాథమిక పాఠశాలలో సల్లోజు జానయ్య జగదాంబ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు పెన్సిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందన్నారు. మన ఊరి బడిని మనమే కాపాడుకోవాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయలు శ్రీవాణి అధ్యక్షతనన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ గోలి చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంటెపాక యేసురత్నం, మాజీ ఎంపీటీసీ తండు మమత సైదులు గౌడ్, వార్డు సభ్యులు సరోజ, ఉపాధ్యాయురాలు పారిజాత పాల్గొన్నారు.