Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ నరేందర్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, కాచిన నీటిని తాగాలని తెలియజేయాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.c