Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకట్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కేఎస్.రెడ్డి అన్నారు. గురువారం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో టీఎంయూ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రతి డిపోలో ఉన్న అక్రమ ఓడీలను రద్దు చేయాలని, డ్రైవర్, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని కేటగిరిల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిపోలలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. శానిటేషన్ను మెరుగు పర్చాలన్నారు. డ్రైవర్లను బలవంతంగా టీమ్ డ్యూటీలు చేయించే విధానం మానుకోవాలన్నారు. పెంచిన పని భారాన్ని వెంటనే తగ్గించాలన్నారు. మహిళ కండక్టర్లకు రాత్రి 9 గంటల లోపు వచ్చే డ్యూటీలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ గౌరవాధ్యక్షులు పల్లా దేవేందర్రెడ్డి, రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ ఎస్.రెడ్డి, మొహినొద్దిన్, పాండురంగయ్య, ముజఫీర్, ఏఎన్. స్వామి, ఎన్ఆర్సీ. రాజు, హాసన్బాబా, సైదులు, శంకరయ్య, సరస్వతీ, అండాలమ్మ, అన్వర్, ఏఎన్.రెడ్డి పాల్గొన్నారు.