Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ కార్యాలయం ఎదుట లబ్దిదారుల ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టాలిచ్చిన తమకు వెంటనే స్థలాలివ్వాలని కోరుతూ అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన బీసీ, ఎస్సీ లబ్దిదారులు గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ జగన్నాధరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాకు ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. 2005లో గ్రామానికి చెందిన 60 మంది ఎస్సీ, బీసీ లబ్దిదారులకు సర్వే నెంబర్ 25లో ఇండ్లపట్టాలిచ్చారని గుర్తు చేశారు. కానీ నేటి వరకూ స్థలాలు చూపించలేదన్నారు. ఈ విషయంపై నిత్యం అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఇండ్ల స్థలాలు చూపించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవతల సైదులు, తలకొప్పుల సైదులు, బైరం కొండలు, ఎం. శ్రావణ్, శంకర్, చిన ఆంజనేయులు, సైదయ్య పాల్గొన్నారు.