Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు
నవతెలంగాణ-నల్లగొండటౌన్
కళాశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులను గేటు బయటే ఉంచటం అన్యాయమని కేవీపీస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని చర్లపల్లిలో గల డిగ్రీ గురుకుల రెసిడెన్షియల్ కళాశాల వద్ద విద్యార్థినులు సెలవుల అనంతరం ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ లోనికి అనుమతించలేదు. దీంతో విషయం తెసులుసుకున్న ప్రజా సంఘాల నాయకులు విద్యార్థినులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ గంటల తరబడి గేట్ బయటే ఉంచటం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, చిన్న, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.