Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లు, రక్తదానాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ - విలేకర్లు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. పలుచోట్ల రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
నిడమనూరు మార్కెట్కార్యాలయంలో కెవి. రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, వైస్ ఎంపీపీ బైరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్లో పైలాన్కాలనీలో టీఆర్ఎస్ నందికొండ మున్సిపాలిటీ ఇన్చార్జి కర్నె బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. తిరుమలగిరి(సాగర్)లో రైతుసమన్వయసమితి మండల కోఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్రెడ్డి, ఎంపీటీసీ పుట్లూరి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. నాగార్జునసాగర్లో చినరామయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటరీ కాంట్రాక్టు వర్కర్స్ సూపర్వైజర్ దినేష్, రవిలు కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసచక్రవర్తి, రాజశ్రీ పాల్గొన్నారు. మిర్యాలగూడలో సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరియాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ ఫౌండేషన్ సభ్యులు సిహెచ్.భరత్, శ్రీనివాస్ ఆర్ఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవరకొండలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో స్థానిక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
నకిరేకల్ మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, సకినాల రవి, పల్లె విజరు, వీర్లపాటి రమేశ్, ఎల్లపురెడ్డి సైదారెడ్డి, రాచకొండ వెంకన్న, వంటెపాక సుందర్, ఆరూరి వెంకటేశ్వర్లు, యానాల లింగారెడ్డి, ఆరుట్ల శ్రవణ్, మండల కృష్ణ, బద్రి పాల్గొన్నారు. కట్టంగూర్ కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులకు టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పండ్లు, ప్లేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కోమలమైన సైదులు, ఐటిపాముల ఉపసర్పంచ్ ముత్యాల లింగయ్య, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు మన్యం మణిదీప్, ఉద్దీపన కోఆర్డినేటర్ గోగు బాల సైదులు, టీఆర్ఎస్వీ జిల్లా కార్యదర్శి దేవరకొండ నరేశ్ పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలోని పానగల్లో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి విద్యార్థులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్కె. లతీఫ్, వెంకటేశ్వర్లు, వెంకటాద్రి, వెంకన్న, మల్లేశ్, వెంకటాచారి పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శులు కలకోల పురుషోత్తంరెడ్డి, యానాల ప్రభాకర్రెడ్డి, కోఆర్డినేటర్ నరేశ్, ఉపేందర్ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. శ్రవణ్కుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపున అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ సిఐలు బాషా, సురేష్, ట్రాఫిక్ సిఐ సురేష్ కుమార్, ఎస్ఐలు నర్సింహా, కొండల్ రెడ్డి, సతీష్ తదితరులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి, టీఆర్ఎస్ నాయకులు వేమిరెడ్డి జితేందర్రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఎంపీటీసీ-1 పరిధిలో గల సత్రంబడి అంగన్వాడీ కేంద్రంలో ఎంపీటీసీ-1 దుబ్బాక పావని శ్రీధర్ చిన్నారులతో కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో చిట్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎమ్డి. రహీంఖాన్, కోఆప్షన్ సభ్యులు వాజిద్ అలీ, పసునూరు శ్రీను, కొండల్రెడ్డి, వెంకన్న, రాజు పాల్గొన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంత్రిని ఘనంగా సన్మానించి మంత్రిచే కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమరి లింగయ్య, ఆ పార్టీ నాయకులు నర్సిరెడ్డి, లక్ష్మయ్య, కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఆదిమల్లయ్య, మాజీ ఎంపీటీసీ కృష్ణ పాల్గొన్నారు.