Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వచ్ఛందంగా మూసేసిన వ్యాపార, వాణిజ్య సముదాయాలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఓటరు జాబితాలో తప్పొప్పులున్నాయని, ఇష్టానుసారంగా వార్డులను విభజించడాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన మిర్యాలగూడ బంద్ గురువారం విజయవం తమైంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆయా పార్టీల నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలని, ఓటరు జాబితాలో తప్పొప్పులు సవరిం చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆయా పార్టీల నాయకులు శంకర్ నాయక్, డబ్బికార్ మల్లేష్, సాథినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, బంటు వెంకటేశ్వర్లు, చిలుకూరి బాలు, రేపాల పురుషోత్తంరెడ్డి, నూకల వేణుగోపాల్రెడ్డి, జలంధర్రెడ్డి, జగదీశ్చంద్ర, మల్లు గౌతమ్రెడ్డి మహ్మద్బీన్సయీద్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఆరీఫ్, సలీం, యూసుఫ్, మెరుగు శ్రీనివాస్, చిరంజీవి పాల్గొన్నారు.