Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య విమర్శి ంచారు.ఆదివారం కొండమల్లేపల్లి పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం, రాష్ట్రాల్లో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పాలక ప్రభుత్వాలు అమలు చేయ కుండా వాటిని సవరించడం సరికాదన్నారు. ప్రభుత్వాలు వెంటనే కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం 13 మందితో నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు.మండల కన్వీనర్గా నల్లా చినవెంకటయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్ర మంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగటి నాగరాజు, రహీం, బాలు, శ్రీను, పాండు, శంకర్, సరస్వతి, సైదులు సాయిలు, చంద్రమౌళి పాల్గొన్నారు.