Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
దసరా సందర్భంగా బతుకమ్మ చీరలతో పాటు, రేషన్ షాపుల ద్వారా 11 రకాల నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయాలని వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థన శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులందించారన్నారు. ప్రస్తుతం కూడా నిత్యావసరాలందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉష, హేమ, జ్యోతి, కవిత, అరుణ పాల్గొన్నారు.