Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
మూసీ రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 635 అడుగులకు చేరుకుంది. ఎక్కువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 2వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 635 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.07 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రాజెక్ట్ ఇంజనీర్ మమత తెలిపారు.