Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని కానీ నేడు వర్గీకరణకు మద్దతు ఇస్తామని బీజేపీ నాయకులు అనడం అన్యాయమని మాల, మాదిగల మధ్య చిచ్చుపెటొద్దని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు రేఖల సైదులు అన్నారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మాలమాదిగల అభివృద్ధి కోరితే వర్గీకరణకు మద్దతు ఇవ్వడం కాదు రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాని విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వర్గీకరణకు మద్దతు ఇస్తానన్న మాటను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో గతంలో టీడీపీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో టి.విజరు, యాదిగిరి, అంజయ్య, భాస్కర్, వెంకన్న, అంజమ్మ, నగేశ్, సాగర్, రజినికాంత్ పాల్గొన్నారు.