Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కలెక్టరేట్
టీఎస్ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 30, అక్టోబర్ 1,2 తేదీల్లో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని మోడల్స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపాటి క్రాంతికుమార్ కోరారు. ఆదివారం స్థానిక ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం మోడల్స్కూల్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలని, సర్వీస్రూల్స్ విడుదల చేయాలని, హెల్త్కార్డులు జారీ చేయాలని, బోధనేతర సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఉయ్యాల వెంకటేశ్గౌడ్, జిల్లా కోశాధికారి వెంకట్రావు, యాదగిరి పాల్గొన్నారు.